వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : బెల్లంపల్లి ఏరియాలోని వర్క్షాప్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షతన కార్మికుల సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాకముందు ప్రాంతం ఎదుర్కొన్న పరిస్థితులను, స్వరాష్ట్ర సాధన తర్వాత సాధించిన ప్రగతిని కార్మికులకు వివరించారు. తెలంగాణ సాధన కోసం బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను, మలిదశ ఉద్యమంలో బిఆర్ఎస్ పార్టీ పోషించిన కీలక పాత్రను ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా స్మరించుకున్నారు. అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధరావత్ మంగీలాల్, పిట్ సెక్రటరీ శ్రీనివాస్, అసిస్టెంట్ సెక్రటరీ సురేష్, స్టోర్ పిట్ సెక్రటరీ గణపతి, ముఖ్య నాయకులు లక్ష్మీనారాయణ, వైకుంఠం, వెంకన్న, వెంకటస్వామి తదితర యూనియన్ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
వాస్తవ గమ్యం