Friday, 11 September 2026 01:47:36 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

మందమర్రి ఏరియా జీఎంను కలిసిన కల్యాణిఖని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు

త్వరలోనే ఆర్కే-1 ఫేజ్-2 ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్య పరిష్కారం: జీఎం

Date : 02 September 2026 12:26 PM Views : 375

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ (జీఎం)ని కల్యాణిఖని నూతన ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఏరియాలో నెలకొన్న పలు సమస్యలతో పాటు సింగరేణి ప్రాజెక్టులు,కార్మికుల సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించారు.మందమర్రి పట్టణ భవిష్యత్తుకు భరోసానిస్తూ పలు అంశాలపై జీఎంతో జరిపిన చర్చల వివరాలు.స్థానికంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్కే-1 ఫేజ్-2 బొగ్గు గనికి సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, అతి త్వరలోనే సానుకూల ఫలితం (శుభవార్త) రానుందని జీఎం పేర్కొన్నారు. అనుమతులు రాగానే పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.రానున్న కాలంలో మందమర్రి ఏరియా మరింత అభివృద్ధి చెందేలా కొత్త ప్రాజెక్టుల విస్తరణకు సింగరేణి సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.పట్టణంలోని తాగునీరు, డ్రైనేజీ, స్థానిక మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి సైతం ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.ప్రజా సమస్యలను యాజమాన్యం దృష్టికి తేవడంలో, సంస్థ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని ఈ సందర్భంగా జీఎం కొనియాడారు.ఈ కార్యక్రమంలో కల్యాణిఖని నూతన ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :