వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న ఈపీ ఫిట్టర్లకు తక్షణమే కౌన్సెలింగ్ నిర్వహించాలని హెచ్.ఎం.ఎస్ యూనియన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రాజెక్టు ఇంజనీర్ వీరన్నకు యూనియన్ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. కైరిగూడ ఓసిపిలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఫిట్టర్లకు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టాలి.ఇప్పటికే వీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారిని, కౌన్సెలింగ్ ద్వారా వెళ్ళే వారి స్థానంలో నియమించి విధులు కేటాయించాలి.యాజమాన్యం స్పందించి అర్హులైన ఫిట్టర్లందరికీ కౌన్సెలింగ్ నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో కైరిగూడ ఓసిపి ఇంచార్జి డి.వెంకటేష్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎం. కుమార్ గౌడ్, ఏరియా ఆర్గనైజర్లు ఎస్.కె ఇనూస్, కళ్యాణ్, ఎ. రాజశేఖర్, చారి, ఎండి జానీ, శ్రీనివాస్లతో పాటు పలువురు కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం