Sunday, 13 September 2026 08:40:21 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సింగరేణి సెక్యూరిటీ కి రక్షణ కరువు

​సింగరేణిలో సెక్యూరిటీ గార్డుల ఆందోళన..నాలుగో రోజుకు చేరిన నిరసనలు

Date : 10 April 2026 10:46 AM Views : 355

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​సింగరేణి సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న 220 మంది కార్మికులను అకస్మాత్తుగా తొలగించడాన్ని నిరసిస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. టెండర్ గడువు ముగిసిందనే సాకుతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రోడ్డున పడేయడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 12 ఏళ్లుగా సంస్థ ఆస్తులను కాపాడుతూ శ్రమించిన కార్మికులను, వయస్సు సాకుతో మరియు కొత్త టెండర్ల పేరుతో పక్కన పెట్టడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.రెండు నెలలుగా జీతాలు లేక, కుటుంబ పోషణ భారమై సెక్యూరిటీ గార్డులు మార్కెట్ వీధుల్లో భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 220 కుటుంబాలు చీకట్లోకి వెళ్లాయని వారు ఆవేదన చెందుతున్నారు.కార్మిక శాఖ మంత్రి సొంత ప్రాంతంలోనే కార్మికులకు ఈ పరిస్థితి ఎదురవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వమే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.వెంటనే కొత్త టెండర్లు పిలిచి, పాత కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి.వయస్సు పేరుతో చేస్తున్న వడపోతను తక్షణమే నిలిపివేయాలి.పాత పద్ధతిలోనే పోస్టులను కొనసాగించి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ​ యాజమాన్యం మొండివైఖరి వీడకపోతే ఈ నిరసన జ్వాలలు సంస్థ వ్యాప్తంగా విస్తరిస్తాయి. ఆకలితో ఉన్న పేదవాడి భిక్షా పాత్రలే రేపు తిరుగుబాటు ఆయుధాలుగా మారుతాయి." అని సీఐటీయూ హెచ్చరించింది.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :