వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైపూర్ మండలంలోని ఇందారం, టేకుమట్ల, నర్సింగాపూర్, గంగిపల్లి గ్రామాల్లో మంగళవారం ఎంపీడీవో జి.సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపురావు పర్యటించి జనగణన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని గుర్తించి, సభ్యుల వివరాలు సేకరించి గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నారని, ప్రజలందరూ ఈ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు, ఎక్కడా బిల్లులు పెండింగ్లో లేకుండా పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఎం.డి.ఫయాజ్, ఉపసర్పంచి ఎల్కటూరి శివ, హౌసింగ్ ఏఈ కాంక్ష, కార్యదర్శులు ఎల్.ప్రశాంత్, ఆర్.శ్రావణి, ఎస్.సుప్రియ, ఏ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం