Sunday, 13 September 2026 07:39:19 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

గుర్తుతెలియని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య

Date : 17 July 2026 07:53 PM Views : 403

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం పర్స నంబల కు చెందిన మసాడే సోమయ్య (65) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు. మృతుడి భార్య కరుణా బాయ్ రెబ్బన పోలీస్ ఫిర్యాదు చేశారు.మృతుడికి భార్య లక్ష్మి సుజాత అనే ఇద్దరు కూతుర్ల తో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు అయిన లక్ష్మి గత కొంతకాలంగా హైదరాబాదులో కూలీ పనులు చేసుకుంటూ అక్కడ జీవిస్తోంది. గురువారం నంబాలలో ఉంటున్న చిన్న కూతురు సుజాత ఇంటికి లక్ష్మి రావడంతో తనని చూసేందుకు పర్స నంబాల నుండి సోమయ్య తో పాటు ఆయన భార్య నంబాల కి వెళ్ళారు.ఆ రోజంతా అందరూ కలిసి చిన్న కూతురు ఇంట్లో ఉండే శుక్రవారం ఉదయం పెద్ద కూతురు లక్ష్మి తిరిగి హైదరాబాద్ వెళుతుండడంతో ఆమెను రైలు ఎక్కించేందుకు సోమయ్య, అతని భార్య, చిన్న కూతురైన సుజాతలు ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అయితే సోమయ్య అతని భార్య, ఇద్దరు కూతుళ్లు స్టేషన్ లో ఉండగా చాయ్ తాగి వస్తానని వారికి చెప్పి రెబ్బెన బస్టాండ్ వైపు వెళ్ళాడు. చాయ్ తాగి తిరిగి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో మెడపై బలంగా మోదడం తో తల మొండెం వేరు అయి సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడమైనది.. సంఘటన స్థలాన్ని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ రెబ్బెన CI సంజయ్ రెబ్బెన SI వెంకట కృష్ణ పరిశీలించి హత్య జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకున్నారు. నిందితుడి ఆచూకీ కనుక్కునేందుకు రైల్వే స్టేషన్ , ఇతర ప్రాంతాల్లో ఉన్న సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్స్ స్కాడ్ సిబ్బంది సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :