Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం వేల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున వీచిన ఈదురు గాలులు ఓ రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. గాలివాన ధాటికి గ్రామంలోని విద్యుత్ తీగలు తెగి కింద పడగా, అదే సమయంలో అటుగా వెళ్లిన గోదరి తిరుపతి అనే రైతుకు చెందిన పాడిగేదె ప్రమాదవశాత్తు ఆ తీగలను తాకింది. విద్యుత్ షాక్కు గురవ్వడంతో సుమారు 40 వేల రూపాయల విలువ చేసే ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. కళ్లముందే పాడి పశువు ప్రాణాలు కోల్పోవడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతుండగా, సంబంధిత అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతు కుటుంబీకులు కోరారు.
Admin
Vastava Gamyam