వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, నీడ, విద్యుత్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు మరియు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను సిద్ధం చేయాలి.కేటాయించిన రైస్ మిల్లులకే ధాన్యం పంపాలని,నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.గోనె సంచుల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని సూచించారు.రైతులు కేవలం వరిపైనే ఆధారపడకుండా పప్పు ధాన్యాలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం