వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి కార్మికులు కష్టపడి పనిచేస్తూనే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానాలకు చేరేలా తీర్చిదిద్దాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ సూచించారు.మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీలో కన్వేయర్ ఆపరేటర్గా పనిచేస్తున్న డి. రవీందర్ కుమారుడు డి. ప్రవీణ్ కుమార్ ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో విజయం సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి రవీందర్ను జీఎం కార్యాలయంలో బుధవారం జీఎం ఎన్. రాధాకృష్ణ శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, సాధారణ కార్మికుడి కుమారుడు డీఎస్పీగా ఎంపిక కావడం సింగరేణి కుటుంబానికే గర్వకారణమన్నారు. ప్రవీణ్ కుమార్ విధి నిర్వహణలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్మికులు రక్షణ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించడంతో పాటు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) సీహెచ్ అశోక్ పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం